అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో ఆదివారం సంక్రాంతి పోటీలు నిర్వహించారు. స్లో సైక్లింగ్, స్కిప్పింగ్ పోటీల్లో గ్రామానికి చెందిన పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు గ్రామానికి చెందిన ఎస్సై సుమన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసరి సాయినాథ్, బొల్లారం గంగాదాస్, రంజిత్, సాయితేజ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.