Advertisement
అక్షరటుడే, బోధన్: పట్టణంలోని శ్రీ మారుతి మందిరం ఒకటో నంబరు షాపును దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం జప్తు చేశారు. సదరు షాపు యజమాని కొద్ది నెలలుగా అద్దె చెల్లించకపోగా.. అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో దుకాణంతో పాటు అందులోని సామాగ్రిని జప్తు చేసినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల తెలిపారు. ఈవో రవీందర్ గుప్తా, రాములు, వరుణ్ పాల్గొన్నారు.
Advertisement