బాధిత కుటుంబానికి పరామర్శ

0

అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాములు కుటుంబాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాను వచ్చానని మంత్రి తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.