అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ గన్ మెన్ల తొలగింపు అంశం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు మేయర్ కు 1+1 చొప్పున గన్ మెన్లు రక్షణగా ఉన్నారు. మూడ్రోజుల కిందట పోలీసు శాఖ వీరిని ఉపసంహరించుకుంది. థ్రెట్ లో లేనందునే భద్రతను వెనక్కు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారని మేయర్ వెల్లడించారు.