Advertisement
అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల 2004-05 బ్యాచ్ కానిస్టేబుళ్లు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. నగరంలోని డీఆర్ఆర్ గెస్ట్ హౌస్లో ఆదివారం కార్యక్రామాన్ని నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం ట్రెయినింగ్ సమయంలో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సీఐలు రవీందర్ నాయక్, నాగేశ్, ప్రవీణ్ కుమార్, కానిస్టేబుళ్లు సురేశ్, శంకర్, సంతు, శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement