అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. మొత్తంగా 21 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడిషనల్ డీజీలతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలను బదిలీ చేసింది. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్రగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, వరంగల్ సీపీగా సన్ప్రీత్ సింగ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, భువనగిరి ఎస్పీగా అక్షాంక్ష్ యాదవ్, సిరిసిల్ల ఎస్పీగా గీతె మహేశ్ సాహెబ్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యాపేట ఎస్పీగా నర్సింహా, సీఐడీ ఎస్పీగా రవీందర్, రామగుండం ఎస్పీగా అంబర్కిషోర్ జా నియామకం అయ్యారు.