Transfer of judges | రాష్ట్రంలో 38 మంది న్యాయమూర్తుల బదిలీ

Transfer of judges | రాష్ట్రంలో 38 మంది న్యాయమూర్తుల బదిలీ
Transfer of judges | రాష్ట్రంలో 38 మంది న్యాయమూర్తుల బదిలీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Transfer of judges | రాష్ట్రంలో పలువురు న్యాయమూర్తులు బదిలీ district judges transfers అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్​ న్యాయమూర్తులను (Principal Sessions Judges) బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్(Registrar of the High Court)​ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement

నిర్మల్​ జిల్లా జడ్జి స్వర్ణకుమార్​​ ఎల్​బీ నగర్​కు బదిలీ అయ్యారు. కరీంనగర్​(karimnagar) జిల్లా జడ్జి ప్రతిమ జనగాంకు, కుమార్​ వివేక్​ కరీంనగర్​ ఏసీబీ కోర్టు నుంచి సెకండ్​ అడిషనల్ ఆదిలాబాద్ ​ జిల్లా సెషన్స్​ జడ్జిగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

లక్ష్మీకుమారి కరీంనగర్​ నుంచి మూడవ అదనపు జడ్జి అదిలాబాద్​(adilabad)కు బదిలీ అయ్యారు. అలాగే జగిత్యాల జిల్లా జడ్జి నీలిమ మెదక్​కు, రాజన్న సిరిసిల్ల జడ్జి గద్వాల్​కు, నారాయణ పేట్​ జిల్లా జడ్జి అబ్దుల్​ రఫీక్​ మహబూబాబాద్​కు, నాగర్​కర్నూల్​​ జిల్లా జడ్జి రాజేశ్​బాబు వక్ఫ్​ బోర్డు ట్రిబ్యూనల్​ ఛైర్మన్​గా, మెదక్​ జిల్లా జడ్జి లక్ష్మీ శారద సూర్యాపేటకు బదిలీ అయ్యారు.

నిజామాబాద్​ జిల్లా జడ్జి సునీత కుంచాల పెద్దపల్లి, బోధన్​ జడ్జి రవికుమార్​ గద్వాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. కామారెడ్డి జడ్జి లాల్​సింగ్​ శ్రీనివాస నాయక్​ మంచిర్యాలకు, రత్నపద్మావతి ఎల్​బీనగర్​ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. పట్టాభిరామారావు ఎల్బీనగర్​ నుంచి హన్మకొండకు, ముక్తిదా ఎల్​బీనగర్​ నుంచి యాదాద్రి భువనగిరికి, జయప్రసాద్​ ఎల్​బీ నగర్​ నుంచి సిద్దిపేట్​కు, హరీషా ఎల్​బీనగర్​ నుంచి నిజామాబాద్​ ఎస్సీ,ఎస్టీ కోర్టుకు బదిలీ అయ్యారు.

ప్రదీప్​నాయక్​ ఎల్​బీనగర్ 7వ అదనపు జిల్లా జడ్జి నుంచి ఎల్బీనగర్ 6వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. కవిత ఎల్​బీ నగర్​ నుంచి కరీంనగర్​ ఫ్యామిలీ కోర్టుకు, విక్రమ్​ మేడ్చల్​ మల్కాజ్​గిరి(నేరేడ్​మెంట్​) నుంచి ఏసీబీ కోర్టు కరీంనగర్​కు, నారాయణ బాబు జయశంకర్​ భూపలపల్లి నుంచి కోఆపరేటివ్​ ట్రిబ్యునల్​ ఛైర్మన్​ వరంగల్​కు బదిలీ అయ్యారు.

శివకుమార్​ హైదరాబాద్​ నుంచి కరీంనగర్​కు, సరిత సికింద్రాబాద్​ నుంచి బద్రాద్రి కొత్తగూడెం, రమాకాంత్​ హైదరాబాద్​ నుంచి నాగర్ కర్నూల్​, వినోద్​కుమార్​ సెకండ్​ అడిషనల్​ మెట్రోపాలిటన్​ నుంచి ఫస్ట్​ అడిషనల్​ మెట్రోపాలిటన్​ జడ్జిగా బదిలీ అయ్యారు. పుష్పలత హైదదరాబాద్​ నుంచి రాజన్న సిరిసిల్లకు, మహ్మద్​ అఫ్రోజ్​ అక్తర్​ హైదరాబాద్​ నుంచి మహబూబ్​నగర్​కు ట్రాన్స్ఫర్ చేశారు.

జీవీఎన్​ భరతలక్ష్మి లేబర్​ కోర్టు హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​ సెషన్స్​ జడ్జిగా వెళ్లనున్నారు. ఉష గద్వాల్​ నుంచి హైదరాబాద్​ సిటీకి, రమేశ్​బాబు హన్మకొండ నుంచి జయశంకర్​ భూపాలపల్లికి, శశిధర్​ రెడ్డి ఎల్​బీనగర్​ నుంచి హైదరాబాద్​కు బదిలీ అయ్యారు. శ్రీదేవి సికింద్రాబాద్​ నుంచి మేడ్చల్​ మల్కాజ్​గిరి(కుషాయిగూడ)కు, వీరయ్య సికింద్రాబాద్​ నుంచి మంచిర్యాల జిల్లా జడ్జిగా, శ్రీవాణి సికింద్రాబాద్​ నుంచి నిర్మల్​ జిల్లా జడ్జిగా, నీరజ హైదరాబాద్​ నుంచి రాజన్న సిరిసిల్లకు, పి.శివరామ ప్రసాద్​ ఎస్సీ, ఎస్టీ కోర్టు అదిలాబాద్​ నుంచి జిల్లా జడ్జి అదిలాబాద్​గా, శ్యాంశ్రీ సూర్యాపేట నుంచి సికింద్రాబాద్​కు, బోయ శ్రీనివాసులు మంచిర్యాల నుంచి నారాయణ పేట్​ బదిలీ అయ్యారు.

Advertisement