అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెయూ డిగ్రీ (2021–24) ఫలితాల్లో 44.41 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి తెలిపారు. ఈ మేరకు గురువారం తన ఛాంబర్‌లో ఫలితాలు విడుదల చేశారు. తెయూ పరిధిలో 8,930 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 3,966 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఇందులో బాలురు 27.93 శాతం, బాలికలు 55.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో ఎగ్జామ్‌ కంట్రోలర్‌ అరుణ, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్‌ కంట్రోలర్‌ సాయిలు, నందిని, శాంతాబాయి, పీఆర్వో పున్నయ్య, ప్రోగ్రామర్లు సతీష్, విజయ్, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement