అక్షరటుడే, బోధన్‌: బోధన్‌ పట్టణంలోని ఓ సూపర్‌మార్కెట్‌లో దొంగలు చొరబడి భారీగా నగదు ఎత్తుకెళ్లారు. పట్టణ సీఐ వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆచన్‌పల్లిలో అన్నపూర్ణ హైపర్‌ మార్కెట్‌లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. సూపర్‌మార్కెట్‌పైన గల రేకులు, పీవోపీని కట్‌చేసి లోపలికి ప్రవేశించారు. కౌంటర్‌లో ఉన్న రూ.15 లక్షలను ఎత్తుకెళ్లారని యజమాని సుధీర్‌ తెలిపారు. వరుస బ్యాంకు సెలవులు ఉండడంతో డబ్బులు షాప్‌లోనే పెట్టానని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బోధన్‌ టౌన్‌ సీఐ వీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  EX MLA Shakeel | ముగిసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లి అంత్యక్రియలు