అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం తిరస్కరించింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
రేవంత్ రెడ్డికి సూచనలు చేసిన సుప్రీం
ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఏసీబీని కూడా కోర్టు ఆదేశించింది. సీఎం, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని పేర్కొంది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది.