అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: టీచర్ల సర్దుబాటుకు సంబంధించి విడుదలైన జీవో నంబర్‌ 25పై మోపాల్‌ మండలంలోని ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. హెచ్‌ఎంలకు సీనియార్టీ ఆధారంగా ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని జాక్టో తరపున డిమాండ్‌ చేస్తున్నామని జాక్టో ఛైర్మన్ చీమల శ్రీకాంత్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్షుడు ధర్మేందర్, టీటీయూ అధ్యక్షుడు లాటికర్‌ రాము, ఎస్టీయూ మండల బాధ్యులు శశేందర్‌ పవన్‌ కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement