అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నాలుగో టౌన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు జరిపారు. పేకాడుతున్న 11 మందిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ. 72వేలు నగదు సీజ్ చేశారు. జూదరులను అరెస్ట్ చేసి నాలుగో టౌన్ కు తరలించారు.

Advertisement
Advertisement