Advertisement

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 29న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకూ నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే ఆశా కార్యకర్తలు తక్కువ జీతాలతో, అధిక పనిభారంతో సతమతమవుతున్నారన్నారు. ఆశాలను కార్మికులుగా గుర్తించాలని, వేతనం రూ.2,600 పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా నాయకులు సుకన్య, రమ, లావణ్య, రేవతి, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి లింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement