అక్షరటుడే, బాన్సువాడ: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలో టీయూడబ్ల్యూజే డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నిరంతర ప్రజలకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లతీఫ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అబిద్, రాజేశ్, చందు, గంగాధర్, అహ్మద్, మొయిన్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
Advertisement
Advertisement