అక్షరటుడే, నిజాంసాగర్: కాలువలో జారిపడి బాలుడు మృతిచెందిన ఘటన నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన సందీప్(14) గ్రామానికి చెందిన రైతు స్వామితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న నాగమడుగు ఎత్తిపోతల కాలువలో జారిపడ్డాడు. గమనించిన స్వామి వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి కాలువలో నుంచి సందీప్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో బాలుడు జారిపడి మృతి చెందాడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి తల్లి బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement