Advertisement
అక్షరటుడే, బిచ్కుంద : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. బిచ్కుందకు చెందిన వక్డోత్ సరిచంద్ రేషన్ బియ్యం తరలిస్తుండగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద పట్టుకున్నామని చెప్పారు. టాటాఎస్ వాహనంలోని 25 సంచుల బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
Advertisement