Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: నూతనంగా ఏర్పాటైన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. నిజాంసాగర్ మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనిత రెడ్డి మహమ్మద్​ నగర్​ ఇన్​ఛార్జి ఎంపీడీవోగా నియమితులయ్యారు. కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎంపీటీసీ స్థానాల సవరణ జాబితాను ప్రదర్శించారు. నిజాంసాగర్ ఎంపీడీవో గంగాధర్, కార్యాలయ సిబ్బంది విష్ణు తదితరులు ఉన్నారు.

Advertisement