Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అర్హులైన పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు అందించాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి జీజీహెచ్లోని సమావేశం హాల్లో అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 10న ఒకటి 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Advertisement