Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) జనసేనగా రూపాంతరం చెందిందని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు. విశ్వక్​సేన్​ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరాటే రాజు తనతో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. అనంతరం జై జనసేన అని నినదించారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని, తనకు ఎంతో సంతోషంగా ఉందని చిరు అన్నారు. కాగా మెగాస్టార్​ చిరంజీవి 2008లో పీఆర్పీని స్థాపించిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఆయన తన పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Kiran Royal | కిరణ్ రాయల్ vs లక్ష్మి : ఆ ఒక్క పాయింట్ చెప్పగానే కాంప్రమైజ్ కి ఒప్పుకుంది