Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: బస్సు కోసం నిరీక్షిస్తున్న ఇద్దరు మహిళలను రెడ్మిక్స్ లారీ ఢీకొంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవాని తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న అంతాయిపల్లి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement