Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎమ్మెల్యే రాజాసింగ్​ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ స్పందించారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకు నిబంధనల మేరకు కమిటీ ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి కోసం నిబంధనలు మారబోవన్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. ‘రాజాసింగ్ కు​ ఇబ్బంది కలిగి ఉండవచ్చు.. ఆయన బాధపడి ఉండొచ్చు.. నేను కాదనను.. ఆయన ఓ మంచి నాయకుడు. ధర్మం కోసం, పార్టీ కోసం కష్టపడే నేత. కొందరు రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడి ఉండవచ్చు..’ అని పేర్కొన్నారు.

Advertisement