MP Arvind : సీఎం రేవంత్ రెడ్డిపై అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

MP Arvind : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ కౌంటర్
MP Arvind : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ కౌంటర్
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Arvind : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్​ కౌంటర్​ ఇచ్చారు. కిషన్​రెడ్డి రాష్ట్రంలోని ప్రాజెక్ట్​లకు అడ్డుపడుతున్నారని అనడం సరికాదన్నారు. ఎలా అడ్డు పడుతున్నారో చెప్పాలన్నారు. ఇలా అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఆయా ప్రాజెక్ట్​ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు, భూసేకరణ చేపట్టినా కూడా కేంద్రం ఏం ఇవ్వడం లేదో చెప్పాలని ఎంపీ డిమాండ్​ చేశారు. కావాలంటే తాను కిషన్​రెడ్డిని తీసుకొని ప్రధాని వద్దకు వస్తానని, సీఎం కూడా వస్తే అక్కడే చర్చిద్దామని సవాల్​ విసిరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రధాని మోదీ సమానంగా చూస్తున్నారని తెలిపారు.

MP Arvind : ప్రజలు తిడుతున్నారు

అధికారంలో రావడం కోసం కాంగ్రెస్​ చేసిన వాగ్ధానాలను ప్రస్తుతం అమలు చేయడం లేదన్నారు. దీంతో ప్రజలు సీఎం రేవంత్​రెడ్డిని తిడుతున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్​కు వ్యతిరేకంగా తయారవుతున్నారని చెప్పారు. హామీల అమలు గురించి చెప్పకుండా, సీఎం రేవంత్​రెడ్డి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement