అక్షరటుడే, నిజామాబాద్ సిటీ :
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ధన్పాల్ పేర్కొన్నారు. కిషన్రెడ్డిపై ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కిషన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ వరుస విజయాలే ఆయన పనితనానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.