అక్షరటుడే, వెబ్డెస్క్ : Police | తాము పనిచేసే పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు ఇద్దరు పోలీసులు. విధులు నిర్వహించే ఠాణానే సిట్టింగ్ స్పాట్గా మార్చుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్ స్టేషన్లోనే మద్యం తాగారు. తాము బయట మందు తాగితే ఇబ్బంది అవుతుంది అనుకున్నారో ఏమో ఏకంగా ఠాణాలోనే దుకాణం తెరిచారు.
Police | ఫొటోలు వైరల్
పోలీసులు స్టేషన్లో మద్యం తాగుతున్న ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం బయటకు రావడంతో పాటు ఫొటోలు వైరల్ అవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్ను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.