అక్షరటుడే, నిజాంసాగర్: Womens Day | నేటి సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని జడ్పీ మాజీ ఛైర్పర్సన్ దఫేదార్ శోభా రాజు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పురుషులతో సమానంగా మహిళలు ముందుకు వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Womens Day | ఆత్మవిశ్వాసంతో ముందుకు..
మహిళలు ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వాలు సహకారం అందించాలని దఫేదార్ శోభ విజ్ఞప్తి చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. వారి కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ప్రోత్సహించాలని సూచించారు. మహిళల్లో శక్తి సామర్థ్యాలు అపారమని.. వాటిని ఉపయోగిస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆమె ఆకాంక్షించారు.