Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: TGS RTC | ఆర్మూర్ డిపో నుంచి ధర్మపురికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీఎం రవికుమార్ తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు ఈ నెల 11నుంచి 15 వరకు ప్రతేక బస్సు సర్వీసులు కొనసాగుతాయని పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి స్కీం వర్తిస్తుందన్నారు. పెద్దలకు రూ. 220, పిల్లలకు రూ.120 ఛార్జి ఉంటుందన్నారు. ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
Advertisement