అక్షరటుడే, వెబ్డెస్క్ : Vamshi | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు చెప్పింది. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో జూమ్ యాప్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీకి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వంశీని జిల్లా జైలుకు తరలించారు.
Vallabhaneni Vamshi | కస్టడీకి ఇవ్వని కోర్టు
రిమాండ్ ముగియడంతో బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆయన పిటిషన్ను తోసిపుచ్చి ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగించారు. అదే సమయంలో వంశీని తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ న్యాయమూర్తి తిరస్కరించారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. అలాగే తన బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్ వేయగా.. భద్రత కారణాల రిత్యా మార్చడం కుదరదని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Vallabhaneni Vamshi | సిట్ ఏర్పాటు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం గతంలోనే సిట్ ఏర్పాటు చేసింది. అక్రమ మైనింగ్తో సహా భూ కబ్జాలపై విచారణకు నలుగురితో కూడిన బృందాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ బృందానికి జీవీజీ అశోక్ నేతృత్వం వహిస్తున్నారు.