Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని అచ్చంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement