అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Attack | సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’పై సైబర్ దాడి జరిగినట్లు దాని యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆరోపించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఎక్స్ ఫ్లాట్ఫామ్పై సైబర్ అటాక్ జరగడంతో సేవల్లో అంతరాయం కలిగిందన్నారు. సోమవారం పలు దేశాల్లో ‘ఎక్స్’ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజూ దాదాపు మూడు సార్లు ‘ఎక్స్’ పని చేయలేదు. దీంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.
Cyber Attack | ఆ దేశం పనేనా..
ఎలన్ మస్క్ మాట్లాడుతూ తాము నిత్యం సైబర్ దాడికి గురవుతున్నట్లు చెప్పారు. దీని వెనక ఓ పెద్ద గ్యాంగ్, లేదా దేశం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ దాడి చేసిన వారి ఐపీ అడ్రస్లు మాత్రం ఉక్రెయిన్లో ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. కాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్కు సాయం నిలిపివేశారు. ఇటీవల వైట్ హౌస్లో జరిగిన మీటింగ్లోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని మధ్యలో నుంచే బయటకు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ సన్నిహితుడు, అమెరికా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ సంస్థ ‘ఎక్స్’పై సైబర్ అటాక్ జరిగింది.