Kamareddy | బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి

Kamareddy | బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి
Kamareddy | బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరు పోలీస్​స్టేషన్​ను సందర్శించారు. ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్ పరిధిలో ఉండే గ్రామాల వివరాలను ఎస్సై ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట సీఐ సంపత్ కుమార్ ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan police | చోరీ కేసు అనుమానితుడితో పోలీస్​స్టేషన్​ ఊడ్పించిన పోలీసులు