అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan |
కాగా.. ఈ ఘటనలో తిరుగుబాటుదారులను హతం చేసి బందీలను విడుదల చేసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిని బీఎల్ఏ ఖండించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరినా పాక్ స్పందించకపోవడంతో.. జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా తీసుకున్న 214 మంది సైనికులను ఉరి తీశామని తిరుగుబాటు దారులు తెలిపారు.
Pakistan | ఖైదీల మార్పిడిని విస్మరించడంతో..
తిరుగుబాటుదారుల బృందం ప్రతినిధి జీయాంద్ బలోచ్ మాట్లాడుతూ.. ఖైదీల మార్పిడి కోసం విధించిన 48 గంటల గడువును పాకిస్తాన్ దళాలు విస్మరించాయని, ఫలితంగా సామూహిక ఉరిశిక్ష అమలు చేశామని పేర్కొన్నారు. రైలు హైజాక్ సమయంలో 12 మంది తిరుగుబాటుదారులు చనిపోయారని తెలిపారు. కాగా దీనిపై ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.