అక్షరటుడే, వెబ్డెస్క్ : DK Aruna | మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణతో సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) ఫోన్లో మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఇటీవల ఓ ఆగంతకుడు చొరబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం ఆమెకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను ఎంపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భద్రత పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ మేరకు పోలీసు(Police) శాఖకు ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని ఆదేశించారు.
Advertisement
Advertisement