అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Electric Bus | ఆర్టీసీ (RTC) ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కాలుష్య నియంత్రణ కోసం విద్యుత్ బస్సులు(Electric Buses) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఆయా డిపోలకు ఆ సంస్థ ఉన్నతాధికారులు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు.
కాగా.. నిజామాబాద్ డిపోకు కూడా జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఈ బస్సులను ఆయా రూట్లలో నడుపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ బస్సులు తరుచూ మొరాయిస్తుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వర్ని బస్టాండ్ వద్ద నిజామాబాద్ డిపో–2 కు చెందిన విద్యుత్ బస్సు ఆగిపోయింది. బస్సు ఎంతకు స్టార్ట్ కాకపోవడంతో మరో బస్సులో ప్రయాణికులను తరలించారు.
ఇటీవల ఆర్మూర్లో కూడా ఎలక్ట్రిక్ బస్సు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ప్రయాణికులను మధ్యలో దింపివేశారు. ఇలా తరచూ ఎలక్ట్రిక్ బస్సులు మొరాయిస్తుండడంపై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.