
అక్షరటుడే, వెబ్డెస్క్ Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహం ఒకే సంవత్సరంలో మూడుసార్లు బృహస్పతి తన స్థానాన్ని మార్చుకోబోతోంది. ఫలితంగా ఈ మూడు రాశుల వారికి ఇక కష్ట కాలమేనని దేవ గురు గోచార ఫలితాల గురించి తెలియజేశారు. బృహస్పతి అంటేనే.. ఆనందాన్ని, శ్రేయస్సును, గౌరవం, జ్ఞానం, సంపదలను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరంలో బృహస్పతి మూడుసార్లు సంచారం చేస్తున్నాడు. దాని ఫలితం మూడు రాశులపై త్రీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడని, మే వరకు ఈ రాశిలోనే ఉంటాడు.
కానీ, ఈ సంవత్సరం 2025లో బృహస్పతి అనేక సార్లు రాశులను మార్చుకోబోతున్నాడు. బృహస్పతి గ్రహం రాశి చక్రంలో దేనినైనా పూర్తి చేయాలంటే దాదాపు 12 నుండి 13 నెలల సమయం పడుతుంది. ఈ సంవత్సరం బృహస్పతి వేగవంతమైన కదలికలు కారణంగా ఒకటీ లేదా రెండు సార్లు లేదా మూడుసార్లు రాశి చక్ర గుర్తులను మార్చుకుంటుంది. ఇలా మార్చుకునే స్థానానికి అర్థమే ఈ సంవత్సరం బృహస్పతి వేగం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
బృహస్పతి రాశి సంచారం ఫలితం : బృహస్పతి మొదట సంచారం 15 మే నుంచి 2025లో జరగబోతుంది. ఈరోజు బృహస్పతి వృషభ రాశి నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బృహస్పతి రెండవ సంచారం అక్టోబర్ 18, 25న రాత్రి 9:30 గంటలకు జరగనుంది. ఈరోజున మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటక రాశి కూడా చంద్ర రాశి అని గుర్తుంచుకోవడం మంచిది. ఈ సంవత్సరం బృహస్పతి చివరి దశ అంటే మూడవ సంచారం డిసెంబర్ 4, 25న రాత్రి 8:30 గంటలకు జరగనుంది.
బృహస్పతి గ్రహం మూడో సంచారం మే 14, 2025 నుండి మార్చి 18, 2033 వరకు కనిపిస్తుంది. ఈ విధంగా బృహస్పతి ఈ గ్రహం పూర్తి 8 సంవత్సరాలు మూడు రెట్లు వేగంతో కదులుతుంది. అందుకే కొన్ని రాశులు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృశ్చికం, మకరం, మీన రాశుల వారిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని ప్రముఖ జ్యోతిష్యుడు అమిత్ శాస్త్రి తెలిపారు.