Farmers | ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటిమట్టం

Farmers | ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటిమట్టం
Farmers | ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటిమట్టం
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్‌ : Farmers | ఎస్సారెస్పీ(SRSP)లో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు (Project)లో నీటిమట్టం 22.564 టీఎంసీలకు చేరింది.

యాసంగి పంటలకు సాగునీరు, తాగునీటికి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో(Inflow) వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5 వేలు, లక్ష్మి కెనాల్‌ ద్వారా 250, అలీసాగర్‌ లిఫ్ట్​కు 540, గుత్ప ఎత్తిపోతలకు 405, టీఎస్‌ఐడీసీకి 312, సరస్వతి కెనాల్‌ ద్వారా 500, ఎస్‌ఎస్సీకి 100 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Milk thistle | వేస‌విలో తిస్టిల్ పంట‌లకు మంచి గిరాకి..ప‌ద్ద‌తి ప్ర‌కారం చేస్తే అన్ని లాభాలే..!

ఆవిరి రూపంలో 510 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 230 క్యూసెక్కులతో కలిపి మొత్తం 7,848 క్యూసెక్కుల అవుట్​ ఫ్లో నమోదవుతున్నట్లు డ్యాం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కొత్త రవి తెలిపారు. ఏప్రిల్‌ 9 వరకు యాసంగి పంటలకు మరో 12 టీఎంసీల నీటిని వదలనున్నారు. దీంతో ప్రాజెక్ట్​లో 10 టీఎంసీల నీరు ఉంటుంది.

Advertisement