అక్షరటుడే, హైదరాబాద్: Hydra : హైడ్రాకు(Hydra) తెలంగాణ హైకోర్టు(telangana High court) మరోసారి చివాట్లు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల గృహాలే కాకుండా పెద్దలవి ఇళ్లు కూడా కూల్చాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెద్దల భవనాలను కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అని పేర్కొంది.
మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డితో కూడిన ధర్మాసనం.. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను నిలదీసింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినా చట్టం దృష్టిలో అందరూ సమానమేనని గుర్తుచేసింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.