అక్షరటుడే, వెబ్డెస్క్: IRCTC | విమానాల్లో(Airplanes) ప్రయాణించే వారికి వెంట తీసుకువెళ్లే లగేజీ(Luggage)పై పరిమితి ఉంటుందని మనకు తెలుసు. అంతకు మించి ఎక్కువ బరువు గల సామగ్రి వెంట తీసుకెళ్తే అదనపు ఛార్జీ(Charges)లు చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే(Railway)లోనూ ఈ రూల్ ఉంది. అయితే చాలా మందికి తెలియక ఎక్కువ మొత్తంలో లగేజీ తీసుకు వెళ్తుంటారు. 2025 సంవత్సరంలో రైల్వేశాఖ(Railways) ఒక వ్యక్తి తీసుకు వెళ్లాల్సిన లగేజీ పరిమితుల వివరాలను తాజాగా వెల్లడించింది.
ఏసీ ఫస్ట్ క్లాస్(AC First Class)లో ప్రయాణించే వ్యక్తి 70 కిలోల వరకు లగేజీ వెంట తీసుకు వెళ్లొచ్చు. ఏసీ 2 టైరులో 50 కిలోలు, త్రీ టైర్, స్లీపర్లో 40 కేజీల చొప్పున, జనరల్ టికెట్(General ticket) కలిగిన వారు 35 కిలోల వరకు లగేజీ తీసుకు వెళ్లొచ్చు. అంతకు మించి సామగ్రి తీసుకు వెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రైల్వేశాఖ(Railways) భారీ జరిమానాలు వేస్తుంది. అంతేగాకుండా రైల్వేశాఖ నిషేధించిన వస్తువులను కూడా వెంట తీసుకు వెళ్లొద్దు.