Toll Charges | అలా అయితే మీరు టోల్​ కట్టవసరం లేదు

Toll Charges | అలా అయితే మీరు టోల్​ కట్టవసరం లేదు
Toll Charges | అలా అయితే మీరు టోల్​ కట్టవసరం లేదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Charges | ప్రస్తుతం సొంత వాహనంలో దేశంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంధన ధరలతో పాటు, టోల్​ ఛార్జీల(Toll Charges) గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో రహదారులను(Roads) అభివృద్ధి చేస్తున్న కేంద్రం టోల్(Toll)​ పేరిట వసూళ్లు కూడా బాగానే చేస్తోంది. జాతీయ రహదారులతో పాటు ఇతర రోడ్లలో కూడా టోల్​ బూత్​లు ఉండటంతో ఒక్కసారి బయటకు వెళ్తే టోల్​ మోత మోగడం ఖాయాం. ప్రస్తుతం దేశంలో సుమారు 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అయితే టోల్​ప్లాజాల వద్ద సమయం వృథా కాకుండా నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(NHAI) ఫాస్టాగ్(Fastag)​ విధానం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొత్త రూల్​ కూడా ప్రవేశపెట్టింది.

Advertisement

Toll Charges | 10 సెకన్ల రూల్​

ప్రజలు తమ వాహనాలతో టోల్​ ప్లాజాల వద్ద నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు వేచి ఉంటే టోల్​ రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఇదే పది సెకన్ల రూల్​. దీని ప్రకారం ఒక వాహనం టోల్ గేట్​ దగ్గరికి వచ్చిన ఐదు నిమిషాల్లోపు వెళ్లిపోవాలి. అంతకుమించి పది సెనక్లు ఆలస్యమైనా టోల్​ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేగాకుండా టోల్​ బూత్​ల వద్ద వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం వాహనాలు బారులు తీరి ఉండొద్దు. రద్దీ సమయాల్లోనూ ఈ రూల్​ వర్తిస్తుంది. ప్రజల సమయాన్ని ఆదా చేయడం కోసం ఎన్​హెచ్​ఏఐ ఈ రూల్​ను 2021లో తీసుకు వచ్చింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Toll Gates | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ఇక టోల్​గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేదు..!

Toll Charges | వీరికి మినహాయింపు..

టోల్​ ప్లాజాల వద్ద బైక్​లు, ఆటోలతో పాటు పలు వాహనాలకు ఫీజు మినహాయింపులు ఉంటాయి. ఆర్మీ, పోలీసు, అంబులెన్స్​, ఫైర్​, అంతిమ యాత్ర వాహనాలు టోల్​ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అంతేగాకుండా ఆయా టోల్​ బూత్​కు 20 కిలోమీటర్ల​ పరిధిలోని గ్రామాల వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను రూపొందించారు. అయితే కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులై ఉండి.. టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే.. లోకల్ రెసిడెంట్ లేదా నెలవారీ పాస్ తీసుకోవాలి.

Toll Charges | కొత్త సిస్టం వస్తే 20 కి.మీ ఫ్రీ

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్​ నావిగేషన్​ శాటిలైట్​ సిస్టం(GNSS) ద్వారా టోల్​ వసూలు చేయాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. దీనిప్రకారం వాహనానికి ఉన్న జీపీఎస్​ ఆధారంగా ఆయా రహదారులపై ఎంత దూరం వెళ్తే దాని ప్రకారం టోల్​ఛార్జీలు ఆటోమేటిక్​గా కట్​ అవుతాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజులో మొదటి 20 కిలోమీటర్లు ఫ్రీగా ప్రయాణించవచ్చని ఎన్​హెచ్​ఏఐ తెలిపింది. ఆ తర్వాత ప్రయాణించిన దూరానికి టోల్​ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.

Advertisement