HCU land dispute | “తప్పుడు కథనాల” వ్యాప్తిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు

HCU LANDS | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మరో అప్​డేట్​..ల్యాండ్​ పరిశీలనకు సాధికార కమిటీ
HCU LANDS | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మరో అప్​డేట్​..ల్యాండ్​ పరిశీలనకు సాధికార కమిటీ

అక్షరటుడే, హైదరాబాద్: HCU land dispute : కంచ గచ్చిబౌలి అటవీ(Kancha Gachibowli forest )వివాదానికి సంబంధించిన AI-జనరేటెడ్ కంటెంట్‌ను ప్రసారం చేశారనే ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం నటి దియా మీర్జా(actress Dia Mirza), యూట్యూబర్ ధ్రువ్ రథీ(YouTuber Dhruv Rathi)పై చర్య తీసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Advertisement

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి అభివృద్ధి గురించి “తప్పుడు కథనాలను” వ్యాప్తి చేయడానికి AI కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ సదరు వ్యక్తులపై చర్య తీసుకోవాలని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Helicopter crash | నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి దుర్మరణం

మరోవైపు సామాజిక మాధ్యమాల్లో (social media) తప్పుడు ప్రచార పోస్టులు పెట్టిన వారు వాటిని తొలగిస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుడు ప్రచార పోస్టులను షేర్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

కంచ గచ్చిబౌలి భూమి విషయంలో తప్పుడు కథనాల వ్యాప్తికి పాల్పడిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) ట్వీట్స్ మాయం అయినట్లు, అదే బాటలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా డిలీట్​ చేసినట్లు సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

Advertisement