అక్షరటుడే, బాన్సువాడ: Kalthi Kallu | కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురై బాన్సువాడ ఆస్పత్రి(Banswada Hospital)లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi) పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మంగళవారం రాత్రి గాంధారి మండలం(Gandhari Mandal) గౌరారంలో కూడా కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి 15 మంది బాన్సువాడ ఆస్పత్రి(Banswada Hospital)లో చేరిన విషయం తెలిసిందే. దీంతో సబ్ కలెక్టర్ (Sub-Collector) ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.