అక్షరటుడే, ఇందూరు: MLA DHANPAL | నగరంలో సమస్యలన్నీ పరిశీలిస్తున్నానని.. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త(MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. బుధవారం 8వ డివిజన్లోని లలితా నగర్, సాయిరాం నగర్, సాయినగర్ కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA) మాట్లాడుతూ.. రోడ్లు(Roads), డ్రెయినేజీ(Drainage) సమస్య కీలకంగా ఉందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను(Municipal Corporation officials) ఆదేశించారు.
డ్రెయినేజీ సమస్య(Drainage problem) పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో(Central Government Funds) పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్(park), ఓపెన్ జిమ్(Open Jim) నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి మోహన్ రెడ్డి(Muncipal EE Muarli Mohan Reddy), అడిషనల్ కమిషనర్ జయకుమార్(Additional Commissioner Jayakumar), ఏఈ భూమేష్(AE Bhumesh), బీజేపీ నాయకులు(BJP Leaders) పాల్గొన్నారు.