Employees | ఉద్యోగుల సమస్యలపై 12న కేబినెట్​ సబ్ కమిటీ సమావేశం

Employees | ఉద్యోగుల సమస్యలపై 12న సబ్ కమిటీ సమావేశం
Employees | ఉద్యోగుల సమస్యలపై 12న సబ్ కమిటీ సమావేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన కేబినెట్​ సబ్​ కమిటీ(Cabinet Sub committee) ఈ నెల 12న సమావేశం కానుంది. ఉద్యోగుల జేఏసీ(Employees JAC) నాయకులు సోమవారం డిప్యూటీ సీఎం(Deputy CM) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులకు సంబంధించిన 57 సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందులో 45 సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని చెప్పారు.

Advertisement

లోక్​సభ ఎన్నికల సమయంలో బదిలీలు చేసిన ఎంపీడీవో(MPDO)లు, తహశీల్దార్ల(Tahaseeldar)ను పాత స్థానాల్లోకి మార్చాలని కోరారు. దీంతో ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి మేరకు ఈ 12న సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. మీటింగ్​లో ఆయా సమస్యలపై చర్చిస్తామన్నారు.

Advertisement