అక్షరటుడే, ఆర్మూర్: Registration office | స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్లాట్బుకింగ్ విధానం తెచ్చింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్(Pilot project) కింద ఆర్మూర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(Sub-Registrar’s Office)లో గురువారం స్లాట్ బుకింగ్ ప్రారంభించారు. ప్రతిరోజు 48 స్లాట్లు బుక్ చేసేలా అవకాశమిచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ(Registration Department) డీఐజీ రమేశ్రెడ్డి తెలిపారు. మొదటిరోజు రెండు స్లాట్లు బుక్ చేసి రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ మహేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు.
Registration office | ఆర్మూర్లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం
Advertisement
Advertisement