అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన నాంపల్లిలోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress) అధిష్టానం సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)ని మార్చాలని ఆలోచిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పదవికి శ్రీధర్బాబు(Sridhar Babu)కు అర్హత ఉందని అర్వింద్ అన్నారు. అయితే శ్రీధర్బాబుకు వసూలు చేయడం రాకపోవడంతో పదవి ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కానీ కమీషన్లు వసూల్ చేసి ఢిల్లీకి మాత్రం డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు.