అక్షరటుడే, కామారెడ్డి:Bhu Bharati | బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు(Farmers) పడ్డ కష్టాలకు పరిష్కారమే భూభారతి(Bhu Bharati) అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూభారతి పోర్టల్ ఆవిష్కరించిన సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భూ భారతి, కొత్త ఆర్వోఆర్ (ROR) చట్టం ద్వారా భూమి హక్కులు భద్రంగా ఉంటాయన్నారు.
భూసమస్యల సత్వర పరిష్కారం దొరుకుతుందన్నారు. రైతుల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) భూభారతి తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్(Dharani Portal) రైతులకు శాపమైతే..భూ భారతి వరం కానుందని ఆయన పేర్కొన్నారు.