అక్షరటుడే, వెబ్డెస్క్:IMD | రైతులకు(Farmers) ఐఎండీ గుడ్న్యూస్(IMD Good News) చెప్పింది. దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం(Heavy Rains) నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ యేడు ఎల్నినో(El Nino) లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.
దేశ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) వ్యవసాయ రంగం వాటా 18 శాతం కావడంతో ఇది రైతులకు శుభవార్త అని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఇటీవల స్కైమెట్ (Skymet) కూడా ఇటీవల దాదాపు ఇదే విధంగా తన నివేదికను విడుదల చేసింది.