అక్షరటుడే, వెబ్డెస్క్ :Rajyasabha | ఏపీ(AP)లో రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల వైఎస్సార్సీపీ(YSRCP) రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పార్టీతో పాటు, ఎంపీ(MP) పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఈసీ షెడ్యూల్(EC Schedule) విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్లు(Nominations) స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 9న రాజ్యసభ(Rajyasabha) స్థానానికి ఎన్నిక నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. కాగా సంఖ్యా బలం ఆధారంగా కూటమికే ఆ స్థానం దక్కనుంది.
Rajyasabha | ఏపీలో రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ విడుదల
Advertisement
Advertisement