అక్షరటుడే, వెబ్​డెస్క్: ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంచులో 47 మంది చిక్కుకుపోయారు. చమోలి-బద్రినాథ్ రహదారిపై హిమానీనదం బరస్ట్​ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎస్డీఆర్​ఎఫ్​, ఎన్​డీఆర్​ఫ్​ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement