అక్షరటుడే, వెబ్డెస్క్: నటుడు సోనూసూద్కు పంజాబ్లోని లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు రాకపోవడంతో అరెస్టు చేసి, హాజరు పర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ కన్నా తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కేసు వేశాడు. ఈ కేసులో నటుడు సోనూసూద్ను సాక్షిగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సమాధానం చెప్పడానికి సోనూసూద్ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు సమన్లు పంపినా కోర్టుకు హాజరవ్వకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
స్పందించిన సోనూసూద్
లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై సోనూసూద్ స్పందించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నెల 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందొద్దని కోరారు.