Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకున్న వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకున్న వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకున్న వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Police | క్షణికావేశంలో కత్తితో పొడుచుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని అహ్మద్​పురా(Ahmedpura)లో చోటు చేసుకుంది. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్​పురాకు చెందిన షేక్​ రఫత్(Sheikh Rafat)​ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన అతడు రోజూ మద్యం తాగి(drunk every day) ఇంటికి వస్తుండేవాడు. కాగా.. మంగళవారం సాయంత్రం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు.

Advertisement
Advertisement

ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై ఇంట్లోని కత్తితో పొడుచుకున్నాడు. భార్య రేష్మాబేగం(Reshma Begum) వెంటనే అతడిని జీజీహెచ్​(GGH)కు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Little Champs Play school | లిటిల్ చాంప్స్ ప్లేస్కూల్​లో ‘పేరెంట్స్​ టీచర్ మీటింగ్’